Wednesday, April 24, 2024
- Advertisement -

జగన్ గెలుపుతో వాళ్లు పండుగ చేసుకుంటున్నారు..!

- Advertisement -

జగన్ గెలుపుతో ఏపీలోని వైసీపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కూడా పనిచేసింది. అయితే టీఆర్ఎస్ ప్రత్యర్థులు కూడా ఇప్పుడంతా హ్యాపీగా ఉన్నారు. ఎందుకా హ్యాపీ అంటే జగన్ అధికారంలోకి రావడమే..

అవును.. చాలా రోజులకు జగన్ సీఎం కావడంతో తెలంగాణలో ఆ సామాజికవర్గమంతా పండుగ చేసుకుంటోంది. తరతరాలుగా వారి ఆధిపత్యం ఉమ్మడి ఏపీపై కొనసాగింది. కానీ తెలంగాణ, ఆంధ్రా విడిపోయాక మాత్రం వారు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ఇద్దరూ అధికారం పంచుకోవడంతో అనాదిగా ఆదిపత్యం చెలాయిస్తున్న ఆ సామాజికవర్గం నేతలు హతాషులయ్యారు..

అయితే జగన్ గెలుపుతో ఇప్పుడు వారంతా హ్యాపీగా ఉన్నారు. మరోసారి పక్కరాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించడానికి తమ సామాజికవర్గానికి అవకాశం దక్కిందని.. తెలంగాణలోనూ తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు.

కాగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ మొత్తం వారి చేతుల్లోనే ఉంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల వేళ ఎంత ప్రయత్నించినా కేసీఆర్ ముందు నిలవలేదు. ఇప్పుడు ఏపీలో తమ సామాజికవర్గం అధికారంలోకి వచ్చినా జగన్ కేసీఆర్ తో స్నేహగీతం ఆలపించడంతో వీరంతా ఆందోళనగా ఉన్నారు. ఎప్పటికైనా జగన్ తమకు అండగా నిలిస్తే తెలంగాణలోనూ జెండా ఎగురవేస్తామని అంటున్నారు. మరి బలమైన ఆ సామాజికవర్గ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -