Thursday, April 25, 2024
- Advertisement -

షియాజీ షిండే గురించి ఎవరికి తెలియని విషయాలు..!

- Advertisement -

‘ఠాగూర్’ మూవీతో తెలుగులో పరిచయమైన షియాజీ షిండే.. ఆ తర్వాత ‘వీడే’ ‘గుడుంబా శంకర్’ ‘అతడు’ ‘సూపర్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దేవదాసు'(2006) ‘పోకిరి’ వంటి సినిమాలు ఇతని రేంజ్ ను పెంచాయి. దాంతో ఇతనికి వరస అవకాశాలు వచ్చాయి. ఇతను ఓ మరాఠి నటుడు అయినప్పటికీ.. తాను నటించిన తెలుగు సినిమాల్లో 95శాతం పైగా సినిమాలకు అతనే డబ్బింగ్ చెప్పుకున్నాడు.

మరాఠి, తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళం,గుజరాతీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా షియాజీ షిండే నటించాడు. ఇంత మంచి నటుడు వాచ్ మెన్ గా పని చేశాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలే షియాజీ షిండే మాట్లాడుతూ..”నేను మహారాష్ట్రలో పుట్టాను. మాది పేద కుటుంబం. ఏడో తరగతి వరకు మా ఊర్లో చదివాను. ఆ తర్వాత చదువు కోసం పక్క ఊరికి వెళ్లేవాడిని. అలా పదో తరగతి కంప్లీట్ చేశాను. తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాను. అయితే అక్కడ ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్‌గా పనిచేసాను. పగలు చదువుకుని రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్‌గా చెయ్యడం. దాంతో వచ్చిన డబ్బులను ఫీజ్ కట్టే వాడిని. అయితే1978, 79 సంవత్సరం టైంలో నాటకాలపై ఆసక్తితో అటువైపు వెళ్ళాను.

అక్కడి నుంచి సినిమాలోకి వచ్చా. 1987లో చేసిన ‘జుల్వా’ అనే నాటకం నాకు మంచి పేరు తీసుకొచ్చింది. మరాఠీ మూవీతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అన్ని భాషల్లో నటిస్తున్నాను. ఇక తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆడరించారు. నేను తెలుగులో నటించిన దాదాపు అన్ని సినిమాలకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. నాకు తెలుగు రాదు. అందుకే నా డైలాగ్స్ హిందీలో లేదా ఇంగ్లీష్ లో రాసి ఇచ్చేవారు. ఇప్పుడు అయితే చాలా వరకు తెలుగు నేర్చుకున్నాను ” అని షియాజీ షిండే చెప్పుకొచ్చాడు.

సాయి ధరమ్ తెజ్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ ఆస్తులు ఏన్నంటే ?

హీరో యష్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

హీరో వెంకట్ గుర్తున్నాడా ? ఇప్పుడేం చేస్తున్నాడంటే ?

సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -