Friday, March 29, 2024
- Advertisement -

వ‌ర‌ల్డ్ క‌ప్‌కు 8 వేల‌మంది భార‌త్ ఆర్మీ ఫ్యాన్స్‌…

- Advertisement -

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న వ‌ర‌ల్డ్ క‌ప్ త్వ‌ర‌లో ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి 8 వేల మందితో భార‌త్ ఆర్మీ సిద్దం అవుతోంది. ఇంగ్లండ్ ఆర్మీని బార్మీ ఆర్మీ అంటారు. దీనికి పోటీగా భార‌త్ అభిమానులు కూడా భారత్ ఆర్మీ పేరుతో మరో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆర్మీలో చాలా దేశాల్లో అభిమానులున్నారు. మరికొన్ని రోజుల్లో ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్ కోసం ఇలాగే 22 దేశాల్లోని 8 వేల మంది భారత్ ఆర్మీ అభిమానులు తరలి రానున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది. యూకేలోనే జరిగిన 1999 వరల్డ్‌కప్ సందర్భంగా కేవలం నలుగురితో ఈ భారత్ ఆర్మీ ప్రారంభమైంది. అది కాస్త ఇప్పుడు వేల మందికి చేరింది. ఇండియా ఆడే ప్రతి మ్యాచ్‌లో కనీసం ఐదు నుంచి ఆరు వేల మంది భారత్ ఆర్మీ అభిమానులు ఉంటున్నారు. భారత్ ఆర్మీ ఇప్పుడు కేవలం యూకేలోనే లేదని, అంతర్జాతీయంగా వివిధ దేశాలకు వ్యాపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -