2019 సంవత్సరంలో అత్యధిక ట్వీట్లు చేసిన టాప్-10 భారత క్రీడాకారుల ట్విట్టర్ హ్యాండిల్స్ జాబితాను ట్విట్టర్ ఇండియా మంగళవారం రిలీజ్ చేసింది. భారత్లోని చాలా మంది క్రికెటర్లకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. 2019లో ధోని రిటైర్మెంట్ గురించి అభిమానులు ఎక్కువగా చర్చించుకున్నారు. అందుకే ఈ ఏడాది ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో ఒకడిగా ఉన్నాడు. ఇంగ్లాండ్లో వన్డే వరల్డ్కప్ ముగిసిన తర్వాత ధోని క్రికెట్కు వీడ్కోలు చెప్పబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.
అదే టైంలో వరల్డ్కప్ తర్వాత క్రికెట్కు ధోని రెండు నెలలు విరాం ప్రకటించడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చినట్లు అయింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని తెలింది. ఇక ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు ఉన్నారు.