Saturday, April 20, 2024
- Advertisement -

ముగిసిన రెండో రోజు ఆట‌.. ఆదుకున్న కోహ్లి,ర‌హానే

- Advertisement -

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేస్తోంది.రెండో ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.కెప్టెన్‌ విరాట్ కోహ్లితో పాటు ,వైస్ కెప్టెన్ ర‌హానే క్రీజులో ఉన్నారు. విరాట్‌ కోహ్లి(82),ర‌హానే(51) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. రెండో రోజు మొద‌టి ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన టీమిండియా ఆదిలోనే రెండ్లు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

మురళీ విజయ్‌ డకౌట్‌గా నిష్క్రమించగా, కేఎల్‌ రాహుల్‌(2) సైతం నిరాశపరిచాడు. చతేశ్వర పుజారాతో జత కలిసిన విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 74 పరుగులు జత చేసిన తర్వాత పుజారా(24; 103 బంతుల్లో 1 ఫోర్‌) పెవిలియన్‌ చేరాడు. ఇక ఆస్ట్రేలియా తన మొద‌టి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -