యాషెస్ టెస్ట్ సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్న ఆసిస్ ఆటగాడు స్మిత్ మరో అరుదైన రికార్డును బద్దలు కొట్టేందకు సిద్దమయ్యారు. ఇప్పటికే కోహ్లీని వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానాన్ని కౌవసం చేసుకున్నారు. ఒకే సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఆడి అత్యధిక పరుగులు చేసిన వెస్టీండిస్ ఆటగాడు వివ్ రిచ్చర్డ్స. 1976 లో ఇంగ్లండుతో జరగిన సిరీస్ లో అతడు 829 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఆతర్వాత స్థానంలో వరుసగా సునీల్ గవాస్కర్ (ఇండియా)774 పరుగులు, గ్రాహమ్గూచ్(ఇంగ్లాండ్) 752 పరుగులు, బ్రియాన్లారా(వెస్టిండీస్) 688 పరుగులతో ఉన్నారు. రిచర్డ్స్ ఈ రికా ర్డును సృష్టించి దాదాపు 43ఏళ్లు గడిచింది. అయితే ఈ రికార్డు బద్దలు కాబోతోంది. రికార్డు బద్దలవ్వాలంటే స్మిత్ ఇంకా 159 పరుగులు చేయాలి. అతడు ఇప్పటికే యాషెస్ సిరీస్లో 134.20 సగటుతో 671 పరుగులు సాధించాడు.సూపర్ ఫామ్లో ఉన్న స్మిత్ ఈ రికార్డు తప్పకుండా బద్దలు కొడతాడని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.