2018 ఆసియా కప్ పోటీల్లో ఎన్ని మ్యాచ్లున్నా…చిరకాల ప్రత్యర్ధుల మధ్య మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఆసియా కప్ హిస్టరీలో పాకిస్థాన్పై ఫేస్ టు ఫేస్ రికార్డ్లో టీమిండియాదే పై చేయి.
అయితే ఈ మ్యాచ్పై ఆరు దేశాల ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఈ మ్యాచ్ చూడటానికి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం సన్నిహితుడు కూడా హాజరవుతాడని సమాచారం. దీంతో భారత్, బ్రిటన్, అమెరికా, రష్యా, చైనాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ మ్యాచ్పై నిఘా పెట్టారు.
బుధవారం జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నెట్వర్క్కి ముఖ్యమైన సమాచారం అందింది. దావూద్ ఇబ్రహీం, డి కంపెనీకి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు ఈ మ్యాచ్ వీక్షించనున్నారని ఏజెన్సీలకు సమాచారం అందింది. ఇప్పటికే ముంబై, కరాచీ నగరాల నుంచి దావుద్ కుటుంబ సభ్యులు, బంధువులు మ్యాచ్ చూడటం కోసం దుబాయ్ వెళ్లారు.