వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య శనివారం ఆసక్తికర పోరుకు రంగం సిద్దం అయ్యింది . టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫిట్నెస్ సాధించిన నువాన్ ప్రదీప్ జట్టులోకి రాగా.. లక్మల్ స్థానంలో సిరివర్దనకు అవకాశం ఇచ్చినట్లు కరుణరత్నె చెప్పాడు.
మరో వైపు ఆస్ట్రేలియా కూడా జట్టులో మార్పులు చేసింది.గాయంతో ఇబ్బంది పడుతున్న కౌల్టర్ నైల్ స్థానంలో బెహ్న్రెండార్ఫ్ను ఎంపిక చేసినట్లు ఆసీస్ సారథి ఫించ్ వెల్లడించాడు.పటిష్ఠంగాలేని లంకపై సునాయాసంగా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువాలని ఆసీస్ భావిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన లంక.. అఫ్గనిస్థాన్పై మాత్రమే నెగ్గింది. తర్వాతి రెండు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఈసారైనా ఆసిస్పై గెలవాలని పట్టుదలతో ఉంది. పటిష్టమైన ఆసిస్ జట్టుముందు నిలువగదా…?