ఆసిస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనంతపురంలో సందడి చేశారు.ఓ కార్యక్రమం నిమిత్తం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయికి బయలుదేరిన గిల్ క్రిస్ట్ మార్గమధ్యంలో అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అందులో ఉన్న క్రీడా వసతుల్ని పరిశీలించారు.ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం క్రికెట్ లో భారత జట్టు ప్రదర్శన బాగుందని కితాబిచ్చారు.
టీమిండియా మిగతా జట్లకు ప్రమాదకరంగా మారింది’ అని తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ విషయంలో కొంచెం తడబడుతోందని గిల్లీ అంగీకరించాడు.అతడి వెంట ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తదితరులు ఉన్నారు.కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గిల్క్రిస్ట్ ఇక్కడికి వచ్చారు