బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్, పాండ్యాలకు బీసీసీఐ తిక్క కుదర్చింది. విచారణ ముగిసే వరకు వారిపై సస్పెన్స్ వేటు కొనసాగుతుందని సీఓఏ తెలిపింది. విచారణకోసం ఇండియాకు రానున్నారు. జట్టులో వారి స్థానంలో శుభమాన్ గిల్, విజయ్ శంకర్ లు రానున్నారు. ఆస్ట్రేలియాతో రెండో వన్డే మంగళవారం అడిలైడ్లో జరగనుంది. అప్పటిలోగా వీరిద్దరూ వన్డే జట్టుతో కలిసే అవకాశం ఉందని సమాచారం.
19 ఏళ్ల శుభమాన్ గిల్ ఎప్పటి నుంచో జట్టులో ఛాన్స్ కోసం చూస్తున్నాడు. తన కన్నా సీనియర్లకు అవకాశాలు రావడంతో సైలెంటైపోయాడు. ఇప్పుడు చాన్స్ వచ్చింది. మరోవైపు భారత్-ఎ తరపున విజయ్ శంకర్ న్యూజిలాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. విజయ్ ఇప్పటికే టీ20ల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు.ఆస్ట్రేలియాతో జరగాల్సి వున్న మిగతా రెండు వన్డేలకు ఇద్దరినీ తీసుకుంటున్నట్లు బీసీసీఐ ట్విట్టర్ అకౌంట్లో అధికారికంగా తెలిపింది.ఆస్ట్రేలియాతో రెండో వన్డే మంగళవారం అడిలైడ్లో జరగనుంది. రేపటికల్లా విజయ్ శంకర్, శుభమాన్ గిల్ ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలున్నాయి.