వెస్టిండీస్ పర్యటన కోసం భారత ఆటగాళ్లు సోమవారం రాత్రి ముంబై నుండి అమెరికాకు వెల్లనున్నారు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్లో టీమిండియా పర్యటించనుంది. సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. యువ ఆటగాడు రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా భాద్యతలు తీసుకున్నాడు.
ప్రంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ టీమిండియా ఓపెనర్ శిఖర్ధావన్ తిరిగి జట్టుతో కలిశాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు సోమవారం రాత్రి తన సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా గడిపాడు. రోహిత్ శర్మతో కలసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. నా పార్ట్నర్తో.. వెస్టిండీస్ పర్యటనకు సిద్ధం’ అంటూ ట్వీట్ చేశాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని విజయ చిహ్నం చూపిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ సెలెక్టర్లు ధావన్ను పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఎంపిక చేశారు. టెస్టు ఫార్మాట్కు మాత్రం ఎంపిక చేయలేదు. మరో వైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టు సభ్యులతో కలిసి దిగిన ఫొటోను తన ట్విటర్లో ఖాతాలో పోస్టు చేశాడు. మియామి బౌండ్’ అని పేర్కొన్నాడు. మియామి అనేది దక్షిణఫ్లోరిడాలోని ఆర్థిక నగరం. స్థానిక సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్లో టీమిండియా X వెస్టిండీస్ జట్ల మధ్య తొలి రెండు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.