Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లీని మళ్లీ కెలికిన భాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్

- Advertisement -

ట్విట్టర్ లో ఎప్పుడూ చురుకుగా ఉండే మాజీ క్రికెటర్, భాజాపా ఎంపీ గౌమ్ గంభీర్ మరో సారి కోహ్లీని కెలికాడు. కోహ్లీ,గంభీర్ మధ్య ఉన్న విబేధాలు అందరికి తెలిసిందే. తాజాగా కోహ్లీని కించపరిచే విధంగా సంచలన వ్యాఖ్యఉ చేశారు. భా రత్ జట్టు పగ్గాలు పూర్తిగా విరాట్ కోహ్లీ చేతికి వచ్చిన తర్వాత టీమిండియాకి దూరమైపోయిన గౌతమ్ గంభీర్.. రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి భాజాపా తరుపున ఎంపీగా గెలుపొందారు.

వీలు చిక్కినప్పుడల్లా కోహ్లీపై తన దైన శైలిలో గంభీర్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రస్తుతం రాణించడానికి కారణం.. రోహిత్ శర్మ, ధోనీ సపోర్టు లభిస్తుండమేనని తాజాగా మళ్లీ తన నోటికి గంభీర్ పనిచెప్పాడు. ప్రపంచకప్ లో భారత జట్టుని సమర్థవంతంగా నడిపించినా…అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రాణించడానికి కారణం.. జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, ధోనీ ఉండటమే అంటూ కోహ్లీకి చురుకు పుట్టే వ్యాఖ్యలు చేశారు.

కెప్టెన్ నిజమైన సత్తా.. ఐపీఎల్‌ లాంటి టోర్నీల్లో జట్టుని నడిపించినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే.. ఆ టోర్నీల్లో కెప్టెన్‌కి రోహిత్, ధోనీ లాంటి సీనియర్ క్రికెటర్ల సపోర్ట్ ఏమాత్రం లభించదు. ఇంకా నిజాయతీగా చెప్పాలంటే.. రోహిత్ శర్మనే చూడండి.. అతను ముంబయి ఇండియన్స్‌కి నాలుగు టైటిల్స్‌ని అందించాడంటూ కోహ్లీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -