భారత క్రికెట్ కోచ్ ఎంపికలో బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది.టీమిండియా ప్రధాన కోచ్ ఎవరు? అనే విషయంపై ఎంతో ఉత్కంఠ రేగిన తరువాత ఈ రోజు బీసీసీఐ ఎట్టకేలకు రవిశాస్త్రిని ఆ పదవికి ఎంపిక చేసిందని2019 వరల్డ్కప్ వరకూ అతడే కోచ్ అన్న వార్తలు .. మీడియాలో వార్తలు చక్కర్లుకొట్టిన విషయం తెలిసిందే.
ఈ వార్తలపై బీసీసీఐ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. తాము ఇంకా కోచ్ పై తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటన చేసింది. రవిశాస్త్రిని ఈ పదవికి నియామించారన్న వార్తను బీసీసీఐ ఖండించింది. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉందని త్వరలోనే త్వరలోనే కోచ్ ఎంపిక పై అధికారికంగా ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లుగానే రవిశాస్త్రినే వరించిందంటూ మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది.మంగళవారమే కోచ్ ఎవరన్నదీ తెలుస్తుందని తానూ భావిస్తున్నట్లు అమితాబ్ చౌదరిచెప్పారు.