క్రికెట్ లో ధోనీ ఎప్పుడు కూడా ఎవరిపై కోపడటం వంటివి చేయడు అని పేరు ఉంది. అయితే ఐపీఎల్ 2019 సీజన్లో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ బ్యాటింగ్ గురించి ధోనీ నోరుజారినట్లు తాజాగా తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరఫున ఇషాంత్ శర్మ ఆడుతున్న టైంలో వికెట్ల వెనుక నుంచి ధోనీ.. నీకు సిక్స్ కొట్టే పవర్ లేదంటూ అన్నాడట.
ఈ విషయంను ఇషాంత్ శర్మ ఓ యూట్యూబ్ ఛానల్తో తెలిపాడు. “చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోనీ నాతో కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. నీకు సిక్స్ కొట్టే సామర్థ్యం లేదంటూ వికెట్ల వెనుక నుంచి ఎద్దేవా చేశాడు. అదే టైంలో స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్కిరాగా.. నేను వరుసగా 4, 6 కొట్టేశాను.
సిక్స్ బాదిన తర్వాత ధోనీ వైపు చూడగా.. అతను రవీంద్ర జడేజాకి చివాట్లు పెడుతూ కనిపించాడు’’ అని ఇషాంత్ శర్మ వెల్లడించాడు. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదాపడింది. టెస్టులో అగ్రశ్రేణి బౌలర్గా రాణిస్తున్న ఇషాంత్ శర్మ.. వన్డే, టీ20ల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు.