ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో ఆధిపత్యం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య రసవత్తర పోరుకు సిద్దమయ్యింది. చెపాక్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడిన ఢిల్లీ జట్టు 8 మ్యాచ్ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇదే తరహాలో 8 మ్యాచ్లు గెలిచిన చెన్నై జట్టు నెట్ రన్రేట్లో వ్యత్యాసం కారణంగా రెండో స్థానంలో ఉంది.
జ్వరం కారణంగా గత మ్యాచ్కు దూరమైన ధోని.. ఢిల్లీ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ధోనితో పాటు డుప్లెసిస్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి చేరగా మురళీ విజయ్, సాంట్నర్, ధృవ్ షోరేలకు ఉద్వాసన పలికింది.
తుదిజట్లు…
సీఎస్కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, డుప్లెసిస్, రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రేవో, ఇమ్రాన్ తాహీర్, దీపక్ చహార్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా
ఢిల్లీ: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, కోలిన్ ఇంగ్రామ్, రూథర్ఫర్డ్, అక్షర్ పటేల్, జగదీష్ సుచిత్, సందీప్ లామ్చెన్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్