ప్రపంచకప్లో భారత్ ఓటమి తర్వాత జట్టులో కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయనె వార్తలు ప్రకంపనలు రేపాయి. దీంతో వన్డే, టీ20లకు కెప్టెన్గా రోహిత్, టెస్ట్లకు కెప్టెన్గా కోహ్లీని నియమించాలనే సూచనలు మాజీ క్రికెటర్లనుంచి వచ్చిన సంగతి తెలిసిందే. బీసీసీఐ కూడా అదే విధంగానె ముందుకు వెల్లింది.
విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లి భావించాడని.. కానీ రోహిత్కి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేకే మళ్లీ మనసు మార్చుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. అందుకే విండీస్ టూర్ నుంచి తాను విశ్రాంతి తీసుకోవడంలేదని కోహ్లీ క్లారిటీ ఇచ్చారు.
ఇదలా ఉంటె వీరి మధ్య ఉన్న విబేధాలు ఉన్నాయన్న వార్తలకు నిజం చేకూర్చుతూ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చాలా కాలం క్రితమే విరాట్ కోహ్లిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిన రోహిత్ శర్మ.. ఇటీవలే కోహ్లి వైఫ్ అనుష్క శర్మను అన్ఫాలో అయ్యాడు. దీంతో కోహ్లి, రోహిత్ శర్మ మధ్య తలెత్తిన విబేధాలు నిజమేనని భావిస్తున్నారు నెటిజన్లు.
రోహిత్ను కోహ్లి, అనుష్క ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కోహ్లి, రోహిత్ ట్విట్టర్లో ఒకరినొకరు ఫాలో కావడం లేదు. కానీ కోహ్లి మాత్రం రోహిత్ వైఫ్ను ఫాలో అవుతున్నాడు. కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో ఇవన్నీ తెరమీదకు వచ్చాయి. విరాట్ కోహ్లి సభ్యుడిగా ఉన్న మేనేజ్మెంట్ కంపెనీ నుంచి రోహిత్, ధావన్ వైదొలగడమే దీనికి కారణమని సమాచారం.