Saturday, April 20, 2024
- Advertisement -

టీమిండియా ఓట‌మిని త‌ట్టుకోలేక గుండె ఆగి మ‌ర‌ణించిన అభిమాని..

- Advertisement -

సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఉత్కంఠ‌బ‌రిత మ్యాచ్‌లో ఇండియా 18 ప‌రుగుల‌తో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇండియా ఓట‌మిని జీర్ణించుకోలేని ఓ అభిమాని టీవీ చూస్తుండ‌గానె గుండె ఆగి మ‌ర‌ణించారు. ఈ విషాదం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మీసాల రాము (35) విజయనగరంలోని ఎంవీజీఆర్‌ కళాశాలలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. నిన్నసాయంత్రం వరకు తోటి ఉద్యోగులతో సరదాగా గడిపిన అనంతరం క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు ఇంటికి వెళ్లిపోయాడు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను చూస్తూ టెన్షన్‌కి గురయ్యాడు.

భారత్‌ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య ప్రమీల, రెండేళ్ల కుమారుడు వున్నారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రెల్లివలసకు రాత్రి 10 గంటల సమయంలో తీసుకువచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -