మాంచెస్టర్ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడి ఓడిపోయి… వరల్డ్ కప్ నుంచీ తొలగిన టీమిండియాలో… మిస్టర్ డిపెండబుల్ ధోనీ రిటైర్మెంట్ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. కాని అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోడింది. దీంతో మరో సారి తెరపైకి ధోని రిటైర్మెంట్ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రముఖ సింగర్ లతా మంగేస్కర్ స్పందించారు. ఈ సందర్భంగా ధోనికి బాసటగా నిలిచారు. ధోని రిటైర్మెంట్ ఆలోచనను మానుకోవాలంటూ ట్విటర్ వేదికగా కోరారు. ‘ధోని జీ. మీరు రిటైర్ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు అభిమానులు భారీ ఎత్తున మద్దతు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ ట్వీట్ను 14 వేల మంది లైక్ చేయగా.. 700 మంది రీట్వీట్ చేశారు.