రెండు రోజుల క్రితం మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ పై 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ సెంచరీతో కదొతొక్కారు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాక్ ఆట మధ్యలో వరనుడు మరో సారి ఆటంకం కలిగించారు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. అయితే 40 ఓవర్లలో పాక్ ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ ఘనవిజయం సాధించింది.
అయితే తాజాగా మ్యాచ్లో ఆకాశంపైకి చూస్తూ పెట్టిన ఫోజ్ ఫోటో వైరల్ అవుతోంది. వర్షం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఆకాశంవైపు చూడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ సమయంలో నడుముపై రెండు చేతులూ పెట్టుకుని, మబ్బులవైపు కోహ్లీ చూస్తున్నట్టు ఉన్నాడు. ఈ ఫొటోపై ఎన్నో కామెంట్లు రాగా, కోహ్లీ మరోసారి స్పందించాడు. తన చిన్ననాటి ఫోటోతో పాటు పాక్తో మ్యాచ్ సందర్భంగా తీసిన ఫోటోలను జతచేసి ట్వీట్ చేశారు. 90ల నుంచి ఇలా చేస్తున్నానని పేర్కొన్నాడు.