ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ డేర్డెవిల్స్ బుధవారం రాత్రి బలమైన సన్రైజర్స్ను ఢీకొనబోతోంది. పాయంట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న ఢిల్లీజట్టు ఉంది. ఐపీఎల్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే వెనుకబడిన డేర్డెవిల్స్ ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.
ఢిల్లీజట్టులో ప్రతిభావంతుల ఆటగాళ్లు ఉన్నా రానించలేకపోతున్నారు. జట్టులో ఎన్నో మార్పులు చేసింది. కనీసం చివరి నాలుగు మ్యాచ్ల్లోనైనా సమష్టిగా పోరాడి నెగ్గాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. కానీ మిగతా నాలుగు మ్యాచ్ల్లో తప్పక గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్ రేసులో నిలిచే పరిస్థితిలో ఉంది. కనీసం చివరి నాలుగు మ్యాచ్ల్లోనైనా సమష్టిగా పోరాడి నెగ్గాలని ఫ్రాంచైజీ భావిస్తోంది.
ఇక సన్రైర్స్ జట్టు విషయానికి వస్తే అద్భుతమై ఆటతీరుతో పాయంట్లపట్టికలో మొదటి స్థానంలో నిలిచింది .ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ప్లేఆఫ్కు అర్హత సాధించాలని భావిస్తోంది. ఢిల్లీపై గెలిచి ముందుగా ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలవాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది.