ఐపీఎల్-11 సీజన్లో మరో రసవత్తర మ్యాచ్కు ఫిరోజ్-షా కోట్ల మైదానం వేదికైంది. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న చావోరేవో మ్యాచ్లో ఢిల్లీడేర్డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ముంబై జట్టులో మెక్లిగన్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ రాగా.. ఢిల్లీ జట్టులో అవేశ్ఖాన్ స్థానంలో ప్లంకెట్ తుది జట్టులోకి వచ్చాడు.ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ చాలా కీలకం. ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లే ఆఫ్కు వెళ్లుతుంది,లేకుంటే ఇంటికి వెళ్తోంది.
ఇక ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచిని ఓడిన పెద్దగా నష్టం ఉండదు.ఎందుకంటే ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.13 మ్యాచుల్లో 6 మాత్రమే నెగ్గి ఆరో స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ ఎలాగైన గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబైకే ప్లే ఆఫ్ చేరే అవకాశాలున్నాయి. ఆ జట్టు రన్రేట్ రాజస్తాన్, కింగ్స్ పంజాబ్ జట్ల కన్నా మెరుగ్గా ఉంది.