న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 5-0తో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత బౌలింగ్తో ఓడే మ్యాచ్లను సైతం భారత్వైపు తిప్పాడు. ప్రధానంగా చివరి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇందులో ఒకటి మెయిడిన్ ఉండటం విశేషం. ఇదే అంశంపై స్పందిస్తూ బుమ్రాపై బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ప్రశంసల జల్లు కురిపించింది. తనని మ్యాచ్ విన్నర్ ఎవరో చెప్పమంటే ఏమాత్రం ఆలోచించకుండా బుమ్రా పేరే చెప్తానని ఈ బాలీవుడ్ బామ చెప్పింది.
తాజాగా ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించింది. ‘మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ను పిక్ చేయమంటే నేను బుమ్రా పేరే చెబుతా. అతనో అద్భుతమైన ఆటగాడు. కివీస్ను బుమ్రా కట్టడి చేయడం, భారత్ గెలవడం గర్వించదగిన విషయం’ అని చెప్పుకొచ్చింది.