భారత మహిళల క్రికెట్ టీంలో ముసలం రాజుకుంది.ప్రపంచ కప్ వేదికగా జట్టులోని విభేదాలు బయటపడ్డాయి. కీలకమైన సెమీఫైనల్లో మిథాలీ రాజ్కు జట్టులో స్థానంలో కల్పించకపోవడంపై సర్వత్ర విమర్శలు వచ్చాయి.దీనిపై మిథాలీ బీసీసీఐకి ఓ లేఖ కూడా రాసింది.తనను , కోచ్ రమేశ్ పవర్ ఒత్తిడితోనే తనను కావలనే జట్టు నుంచి తప్పించారని కోచ్పై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.ఈ లేఖపై కోచ్ రమేశ్ పొవార్ స్పందించాడు. మిథాలీ రాజ్కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని జట్టు కోచ్ రమేశ్ పొవార్ అంగీకరించాడు.
మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని రమేశ్ పవార్ తెలిపారు.కోచ్పై ఒత్తిడి పెంచడం, బ్లాక్మెయిల్ చేయడం, తన కోసం జట్టు ప్రయోజనాలు పణంగా పెట్టడం ఆమె మానుకోవాలని అతడు పేర్కొన్నాడు. విస్తృత పరిధిలో ఆలోచించి భారత మహిళా క్రికెట్ మేలు కోసం ఆమె పని చేస్తే బాగుంటుందన్నాడు. మరి రమేశ్ పవార్ చేసిన ఆరోపణలపై మిథాలీ రాజ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.