మిథాలీరాజ్ ఇండియన్ మహిళ క్రికెట్లో ఈ పేరు పెను సంచలనమే అని చెప్పాలి. 20 ఏళ్లగా తన జీవితాన్ని ఇండియాన్ క్రికెట్కే దారబోసింది.ఈ హైదరాబాదీ క్రికెటర్ మహిళ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.మొట్ట మొదటిగా 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచింది మిథాలీ.మరి అలాంటి ప్లేయర్కు ఎన్ని సంవత్సరాలో తెలుసా.చూడటానికి 20లలో ఉన్నట్లు కనిపిస్తుంది మిథాలీ.కాని ఆమె వయస్సు 36..అవునండీ మీరు చదివింది నిజమో మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ వయస్సు అక్షరాల 36.
ఆదివారంతో మిథాలీ 35 పూర్తి చేసుకుని 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.ఫిజిక్ మెయిన్టైన్ చేయడంలో మిథాలీ ముందు ఉంటుంది.కఠిన కసరత్తులు చేస్తు నిత్యం ఫాంలో ఉండటానికి ప్రయత్నిస్తునే ఉంటుంది.ఇక ఇటీవలే ముగిసిన మహిళల టి-20 ప్రపంచ కప్లో ఇండియా సెమీస్ నుంచి వెనుతిరిగిన సంగతి తెలిసిందే.కీలకమైన సెమీస్ మ్యాచ్లో మిథాలీని జట్టులోకి తీసుకోవడంపై సర్వత్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.