Friday, April 26, 2024
- Advertisement -

ఐసీసీ ట్వీట్‌పై మండిప‌డుతున్న స‌చిన్ అభిమానులు…

- Advertisement -

న్యూజిలాండ్‌తో ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది విశ్వ‌విజేత‌గా నిలిచింది. జ‌ట్టు విజ‌యంలో బెన్ స్టోక్స్ కీల‌క పాత్ర పోషించారు. ఒక విధంగా చెప్పాలంటె స్టోక్స్ ఆడ‌క‌పోతె న్యూజిలాండ్ విజేత‌గా నిలిచేది. కాని దుర‌దృష్టం వెంటాడింది.

మెగా ఫైట్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 242 లక్ష్య ఛేదనలో స్టోక్స్‌ అజేయంగా 84 పరుగులు సాధించడంతో మ్యాచ్‌ టై అయ్యింది. ఫ‌లితాన్ని తేల్చే సూపర్‌ ఓవర్‌లో కూడా స్టోక్స్‌ ఒక ఫోర్‌ సాయంతో 8 పరుగులు చేశాడు. మరొకవైపు బట్లర్‌ 7 పరుగులు చేశాడు. కాగా, సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ కూడా 15 పరుగులే చేయగా మళ్లీ మ్యాచ్‌ టై అయ్యింది. అయితే మ్యాచ్‌ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ విశ్వ విజేతగా అవతరించింది.

బెన్‌ స్టోక్స్‌ను ఆల్‌ టైమ్‌ గ్రేటస్ట్‌ క్రికెటర్‌గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొంది. ఇంతవరకూ బాగానే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో స్టోక్స్‌ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది. ఇది భారత అభిమానులకు కోపం తెప్పించింది . దీంతో స‌చిన్ అభిమానులు ఐసీసీని ట్విట్ట‌ర్‌లో ఏకిపారేస్తున్నారు.

అసలు బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదంటూ విమర్శిస్తున్నారు. ‘ గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఎవరో తెలుసా’ అంటూ ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘ సచిన్‌తో ఇంకొకరికి పోలిక.. అతనొక క్రికెట్‌ లెజెండ్‌, ఎవరు ఎన్ని చేసినా సచిన్‌ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం‌’ అంటూ మరొకరూ విమర్శించారు. ‘ ఒకసారి ఆ ఇద్దరి గణాంకాలు చూస్తే ఎవరు ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ అనేది అర్థమవుతుంది కదా’ అంటూ అభిమానులు ట్విట్ట‌ర్‌లో విరుచుకుప‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -