- Advertisement -
ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు కాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భీకరమైన విండీస్ పేస్ కు.. బలమైన ఇంగ్లిష్ బ్యాటింగ్కు మధ్య రోస్బౌల్ స్టేడియం వేదికగా పోరు జరుగనుంది. రసవత్తరంగా సాగే ఈ మ్యాచ్లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. వరణుడి అంతరాయం లేకపోవడంతో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫిల్డింగ్ను ఎంచుకున్నాడు.
టీమ్లో ఎలాంటి మార్పులు చేయట్లేదని మోర్గాన్ పేర్కొన్నాడు. విండీస్ జట్టులో మూడు మార్పులు చేశారు. ఎవిన్ లూయిస్, రస్సెల్, షానన్ గాబ్రియెల్ తుది జట్టులోకి వచ్చినట్లు కరీబియన్ కెప్టెన్ హోల్డర్ వివరించాడు