ప్రపంచకప్ సమరం నుంచి ఊహించని విధంగా టీమిండియా నిష్క్రమించింది. న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమితో డీలా పడిన టీమిండియా జట్టుకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.
బుధవారం న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు, స్టాఫ్ తిరిగి స్వదేశానికి రాడానికి టికెట్లు సర్దుబాటు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. దీంతో ఆదివారం వరకూ కోహ్లీసేన మాంచెస్టర్లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
టికెట్లు సర్దుబాటు చేస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.కొందరు మాత్రమే భారత్ కు తిరిగి వస్తారని… మిగిలిన వారు రెండు బృందాలుగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తారని చెప్పారు. వారికి కూడా టికెట్లను సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. టీమిండియా తదుపరి షెడ్యూల్ వెస్టిండీస్తో జరగనుంది. వచ్చేనెల మూడు నుంచి నెలరోజుల పాటు అమెరికాలో విండీస్తో తలపడనుంది. 3 టీ20లు, 3 వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్లను టీమిండియా ఆడనుంది.