Thursday, April 25, 2024
- Advertisement -

కోహ్లీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన గౌత‌మ్ గంభీర్‌..

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆసిస్‌తో స్వ‌దేశంలో టీ20, వ‌న్డే సిరీస్‌లు కోల్పోవ‌డంతో ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్లు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్ నేప‌ధ్యంలో తాజాగా మ‌రో మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ కోహ్లీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విరాట్ కోహ్లీ కంటే ధోనీ, రోహిత్ శర్మలే గొప్ప కెప్టెన్లని గంభీర్ వ్య‌ఖ్యానించారు. ఐపీఎల్ లో ధోనీ, రోహిత్ లు కెప్టెన్లుగా తమ చెన్నై, ముంబై జట్లకు మూడేసి టైటిళ్లను అందించారని… బెంగళూరు సారథిగా కోహ్లీ ఇప్పటి వరకు ఒక టైటిల్ కూడా అందుకోలేకపోయాడని చెప్పాడ‌న్నారు.కోహ్లీ తనకు అంత చురుకైన కెప్టెన్ గా కనిపించడని, గొప్ప వ్యూహాలను కూడా రచించలేడని అన్నాడు.
గెలుపు రికార్డును బట్టే ఒక కెప్టెన్ ప్రతిభను అంచనా వేస్తామని… మూడేసి సార్లు కప్పు గెలిచిన ధోనీ, రోహిత్ లతో కోహ్లీని పోల్చలేమని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -