Thursday, March 28, 2024
- Advertisement -

భారత్ మాజీ క్రికెటర్ కన్నుమూత…

- Advertisement -

భారత మాజీ క్రికెటర్‌ మాధవ్‌ ఆప్టే(86) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు.వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ లను దీటుగా ఎదుర్కొంటూ రెండు సెంచరీలు సాధించారు.

ఈ రెండు సెంచరీలు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ మ్యాచ్‌ల్లోనే చేయడం విశేషం. టెస్టుల్లో అత్యధిక ఆయన వ్యక్తిగత స్కోరు 163. ఓవరాల్‌గా 67 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన మాధవ్‌ ఆప్టే 3,336 పరుగులు చేశారు. వీటిలో ఆరు సెంచరీలతో పాటు 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఇదే క్లబ్ తరఫున సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులోనే మ్యాచ్ లు ఆడి సత్తా చాటారు. మాధవ్ ఆప్టే మృతికి బీసీసీఐతో పాటు, పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -