Wednesday, April 24, 2024
- Advertisement -

ఒత్తిడిలో జడేజా అద్భుతంగా ఆడాడు : గంగూలీ

- Advertisement -

ఆదివారం కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయ సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ చివర్లో పేసర్ శార్దూల్‌ ఠాకూర్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయడంతో ఎనమిది బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలిచింది.

ఈ విజయంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహారించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. గంగూలీ తన ట్విట్టర్‌లో “టీమిండియా మరో విజయం. అభినందనలు. ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో గొప్పగా మెరుగయ్యాడు. ఇది ఎంతో కీలకం” అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్పటికే వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు చేసిన జడేజా ఆదివారం నాటి మ్యాచ్‌లో 31 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గత కొన్నేళ్లుగా రవీంద్ర జడేజా ఎంతో పరిణితిని కనబరుస్తున్నాడు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో జట్టుని ఆదుకుంటున్నాడు. వన్డేల్లో 2188 పరుగులు చేసిన జడేజా… టెస్టుల్లో 1844 పరుగులు చేశాడు. మొత్తంగా 25 హాఫ్ సెంచరీలు (టెస్టుల్లో 14, వన్డేల్లో 11)తో పాటు టెస్టు క్రికెట్‌లో సెంచరీ కూడా సాధించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -