- Advertisement -
భారత టెస్టు క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టు మాజీ సభ్యుడు, ప్రస్తుత ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారి ఓ ఇంటివాడయ్యాడు. హన్మకొండ హంటర్ రోడ్డులోని కన్వెన్షన్ హాల్లో పారిశ్రామికవేత్త ఏరువ రాజేందర్రెడ్డి కుమార్తె ప్రీతిరాజ్తో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విహారి, ప్రీతి రాజ్ క్లాస్మేట్స్ కావడంతో పెద్దల అంగీకారంతో వివాహం జరిపించారు