Tuesday, April 16, 2024
- Advertisement -

పాండ్యాకు మ‌రో బిగ్ షాక్ …

- Advertisement -

టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మరో షాక్. ఇప్ప‌టికే కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి బీసీసీఐ ఆగ్ర‌హానికి గురయ్యారు. వాళ్లిద్దరిని ప్రచారకర్తలుగా నియమించుకున్న పలు ప్రముఖ బ్రాండ్లు, సంస్థలు వాటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలని భావిస్తున్నాయి.

కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో పాండ్య నిలకడగా రాణించడంతో అతనితో తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి కొన్ని కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే జిల్లెట్ సంస్థ.. హార్దిక్‌తో కొన్ని నెలల క్రితం ఒప్పందం చేసుకుంది. తాజా వివాదంతో జిల్లెట్ సంస్థ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

బీసీసీఐ వీరిద్దరిపై ఇప్ప‌టికే సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇద్దరిపై విచారణ చేస్తామని.. భారత్ కు తిరిగి వచ్చాక విచారణ పూర్తయ్యే వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -