కాఫీ విత్ కరణ్ టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు ఇద్దరు క్రికెటర్లు రాహుల్, పాండ్యా. వీరిపై బీసీసీఐ ఇప్పటికే నిషేధం విధించింది. వీరిపై విచారణ పూర్తయ్యే వరకు నిషేధం కొనసాగుతుంది. బీసీసీఐ పంపిన షోకాజ్ నోటీసులకు సమాధాన మిచ్చారు ఇద్దరు. క్షమించండంటూ భేషరుతుగా క్షమాపణ చెప్పారు.
ఇదిలా ఉంటే ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం లేదని ఆయన చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా చాలా బాధగా ఉన్నాడని పాండ్యా తండ్రి హిమానన్షు తెలిపారు. కనీసం ఇంటి నుంచి వెలుపలకి కూడా రావడంలేదన్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హార్దిక్ పాండ్య.. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదని.. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడని అతని తండ్రి చెప్పుకొచ్చాడు.
హార్ధిక్ కు పతంగులు ఎగురవేయడమంటే చాలా ఇష్టమని… కొన్నేళ్లుగా క్రికెట్ కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాడని.. దాంతో పతంగులు ఎగురవేసే అవకాశం రాలేదని హిమాన్షు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. టీవీలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాడని… బీసీసీఐ సస్పెండ్ చేయడంతో బాధపడుతున్నాడని చెప్పారు.