టెస్టుల్లో తన ఆట గురించి గతంలో ఎక్కువగా ఆలోచించేవాడినని.. కానీ ఇప్పుడు కేవలం ఆటను ఆస్వాదించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు భారత ఓపెనర్ రోహిత్ శర్మ చెప్పారు. తన కెరీర్ ఇంత గొప్పగా సాగడానికి కారణం తన కుటుంబమే అని రోహిత్ తెలిపాడు.
తాజాగా ఓ జాతియ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” టెస్టుల్లో సక్సెస్ కావడం గురించి బాగా ఆలోచించేవాడని.. ఇలాంటి షాట్ ఎందుకు ఆడానా అని తలబద్దలు కొట్టుకునేవాడిని. ప్రతి టెస్టు ఇన్నింగ్స్ తర్వాత వీడియో అనలిస్ట్ దగ్గరకు వెళ్లి కూర్చుని నా ఆటను చూసుకునేవాడిని. దీంతో మరింత గందరగోళానికి గురయ్యేవాన్ని” అని అన్నాడు. “టెక్నిక్ గురించి ఆలోచించి ఆటను ఆస్వాధించలేకపోయాను. కానీ గత ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు నా ఆలోచన మారింది. ఫలితం ఎలా ఉన్న సరే టెక్నినిక్ గురించి పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా” అని రోహిత్ అన్నాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్లో టెస్టుల్లో తనకు చివరి అవకాశమని తాను భావించలేదని రోహిత్ చెప్పాడు. “నా కుటుంబం.. భార్య, కుమార్తె వల్ల నేను మంచి స్థితిలో ఉన్నా. ఇతరులు ఏం మాట్లాడిన నేను పట్టించుకోను” అని రోహిత్ చెప్పాడు.