Thursday, March 28, 2024
- Advertisement -

కేదార్ జాద‌వ్‌కు గుడ్ న్యూస్‌….అంబ‌టి రాయుడికి బ్యాడ్ న్యూస్‌

- Advertisement -

ఈవార్త హైద‌రాబాది ఆట‌గాడు అంబ‌టి రాయుడికి షాకింగ్ అనే చెప్పాలి. ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో అత‌ను ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యానికి గాయంనుంచి కోలుకుంటాడా లేదా అన్న అనుమానాలు వ్య‌క్తం అయ్యియి. అత‌ను కోలుకోకుంటె స్టాండ్ బై గా ఉన్న అంబ‌టి రాయుడికి టీమిండియాలో ఆడే ఆశ‌లు చిగురించాయి. అయితే రాయుడి ఆశ‌లు అడియాశ ల‌య్యాయి.

గాయ‌ప‌డిని జాద‌వ్ కోలుకున్నాడు. గురువారం జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. ఫిజియో పాట్రిక్‌ ఫర్హార్ట్ తెలిపారు.మే 22న ప్రపంచకప్‌కు మిగతా జట్టు సభ్యులందరితో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్లడానికి జాదవ్‌ సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా జాదవ్‌ కీలకం కానున్నాడు. ఒకవేళ మే 22వ తేదీ నాటికి జాదవ్‌ కోలుకోకపోతే అంబటి రాయుడు లేదా అక్షర్‌ పటేల్‌కు ఛాన్స్‌ వస్తుందని భావించారు. జాద‌వ్ కోలుకోవ‌డంతో ఇంకేదైనా జ‌రిగితె త‌ప్ప రాయుడికి ఆడె అవ‌కాశం ఉండ‌దు.బ్యాటుతోనే కాకుండా బౌలింగ్‌ పరంగానే జట్టుకు జాదవ్‌ ముఖ్యమే. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మంచి ప్రదర్శనే చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -