జింబాబ్వే క్రికెట్కు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.4(సి), (డి)లను ఉల్లంఘించిన కారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఆడకుండా నిషేధం విధించింది. లండన్లో జరిగిన బోర్డు మీటింగ్ అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ఐసీసీ తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. జింబాబ్వే క్రికెట్ బోర్డుపై అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది.
ప్రస్తుత బోర్డులోని సభ్యులను అక్కడి ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ కమిటీ తొలగించింది. ఇది ఐసీసీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఐసీసీ పేర్కొంది. దీంతో బోర్డుకు వెల్లనున్న నిధులు కూడా ఆగిపోతాయి. ఇకపై ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీలోనూ ఆ జట్టు ఆడేందుకు అవకాశం ఉండదు. క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం లేకుండా ఉండాలని హెచ్చరించింది.మూడు నెలల్లో బోర్డు సభ్యలను తిరిగి నియమించాలని గడువు విధించింది