- Advertisement -
ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంక్ భారీగా పడిపోయింది. గత కొంత కాలంగా వన్డే, టెస్టుల్లో విఫలం అవుతున్న పాక్ టీ20లో మాత్రం మొదటి ర్యాంక్లో కొనసాగుతోంది. టీ20 ర్యాంకింగ్స్లో 286 పాయింట్లు సాధించిన పాకిస్థాన్ నెం.1 స్థానంలో నిలిచింది. ఇక ఇండియా విషయానికి వస్తె వన్డే, టెస్టుల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇండియా టీ20లో మాత్రం 260 పాయంట్లతో ఐదో స్థానానికి పడిపోయింది.
262 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఇంగ్లాండ్ (261), ఆస్ట్రేలియా (261), భారత్ (260) టాప్-5లో నిలిచాయి. ఇక ఆరో స్థానంలో న్యూజిలాండ్ (254) ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (241), శ్రీలంక (227), వెస్టిండీస్ (226), బంగ్లాదేశ్ (220) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి