- Advertisement -
ప్రపంచకప్ లో భాగంగా దాయాది దేశం పాకిస్థాన్ పై నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియాకు బిగ్షాక్ తగిలింది. ఇప్పటికే గాయంతో పలు మ్యాచ్లకు దూరం కాగా ఇప్పుడు బౌలర్ భువికూడా మూడు మ్యాచ్లకు దూరం అయ్యారు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ భువీ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో, మైదానాన్ని విడిచి వెళ్లాడు. తొడ నరాలు గట్టిగా పట్టేయడంతో, ఆయనకు విశ్రాంతి అవసరమైంది.
జూన్ 22వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో, 27న వెస్టిండీస్లతో జరిగే మ్యాచ్లకు భువీ దూరంకానున్నాడు. ఇక జూన్ 30వ తేదీన ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్కు భువీ అందుబాటులో ఉండేది లేనిది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. త్వరలోనే భువీ కోలుకుంటాడని కోహ్లీ తెలిపాడు.అయితే ఒకవేళ స్పీడ్ బౌలర్ అవసరం అనుకుంటే.. షమీ అందుబాటులో ఉన్నాడని కెప్టెన్ చెప్పాడు