Thursday, March 28, 2024
- Advertisement -

మిస్ట‌ర్ కూల్ పై మ‌రో సారి త‌న అభిమానాన్ని చాటుకున్న కోహ్లీ..

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా గాని క్లిష్ట‌స‌మాయాల్లో మాత్రం జ‌ట్టుని ముందుండి న‌డిపంచేది మిస్ట‌ర్ కూల్ ధోనీనె. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం అలాంటిది. రెండేళ్ల క్రితం ధోనీ నుంచి పూర్తి స్థాయిలో టీమిండియా పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ఇప్పటి వరకూ ఏ రోజు కూడా ‘కెప్టెన్‌ కూల్‌’ ధోనిని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడలేదు. కోహ్లీ కెప్టెన్ అయినా ధోనికే అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చాడు.

మే30 నుంచి జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్ కు టీమిండియా సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్యూలో కోహ్లీ ధోనిపై మ‌రో సారి అన అభిమానాన్ని చాటుకున్నాడు. ధోనీ చాలా బాగా గేమ్‌ని అర్థం చేసుకుంటాడు. ఎంతలా అంటే..? వన్డేల్లో తొలి బంతి నుంచి 300 బంతి వరకూ ఎప్పుడు.. ఏం చేయాలి..? ఎలా చేయాలి..? అనేదానిపై అతనికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. అందుకే.. నేను ఆఖరి (35-50) ఓవర్లలో బౌలర్‌కి దూరంగా బౌండరీ లైన్ వద్ద‌కి ఫీల్డింగ్‌ కోసం వెళ్లిపోయినా.. ధోనీనే బాధ్యత తీసుకుని కెప్టెన్‌ తరహాలో బౌలర్‌కి సూచనలు, ఫీల్డింగ్ మార్పులు చేస్తుంటాడు. ఇది గ్రౌండ్లో మా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌యం అని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -