ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు, పరుగులు సాధించిన రోహిత్కు మరో అరుదైన ఘనత దక్కింది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్-5 బ్యాట్స్మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్లో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఐసీసీ.. తన ట్విటర్ పేజీలో టాప్-5 స్పెషల్ బ్యాట్స్మెన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ మొదటి స్థానం దక్కించుకున్నారు. రోహిత్ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్ వార్నర్ 647 పరుగులతో రెండో స్థానంలో, షకీబుల్ 606 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 578 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ జోయి రూట్ 556 పరుగులు చేశాడు.