- Advertisement -
ప్రపంచ కప్లో భాగంగా మరికొద్దిసేపట్లో టీమిండియా-అఫ్గాన్ జట్ల మధ్య మ్యాచ్ మొదలు కానుంది. ఇందులో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే సెమీస్ బెర్త్ చేసుకోవడానికి సులువు అవుతుంది. ఇప్పటి వరకు ఆప్ఘన్ ఒక్క మ్యాచ్కూడా గెలువలేదు. టీమిండియాతో జరిగే మ్యాచ్తోనైనా ఖాతా తెరవాలని భావిస్తోంది ఆప్ఘన్.
భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. గాయపడిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహ్మద్ షమీని టీమ్లోకి తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం గాయపడిన విజయ్ శంకర్ ఫిట్నెస్ నిరూపించుకోవడంతో తుది జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు