- Advertisement -
టీ20 సిరీస్ను కోల్పోయిన టీమిండియా మొదటి వన్డేలో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. మొదటి వన్డే రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. మ్యాచ్ మొదలు కాకుండానే టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రాక్టీ సెషన్లో గాయం కారణంగా ధోని తొలి వన్డేలో ఆడటం అనుమానంగా మారింది. భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా ధోని ముంజేతికి గాయమైంది. వేగంగా విసిరిన బంతి ధోని కుడిచేతికి బలంగా తగలడంతో ధోని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేదు. ఇంకా తుది జట్టును ప్రకటించకపోయినప్పటికీ ధోని ఆడటం అనేది అనుమానంగా మారింది. తొలి వన్డేలో ధోని ఆడతాడా.. లేదా అనే విషయంపై ఈరోజు రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధోనీ దూరం అయితే టీమిండియాకు గట్టి ఎదుర దెబ్బే. ఒక వేల ధోని ఆడకపోతే అతని స్థానంలో పంత్ను తీసుకొనే అవకాశం ఉంది.