ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదలుకాకముందే యువ సంచలనం పృథ్వీ షా గాయపడ్డాడు. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మూడోరోజు ఆట జరుగుతుండగా ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీ షా కాలుకు గాయమైంది. ఎడమకాలు చీలమండ మడతపడటంతో పృథ్వీ బాధతో విలవిల్లాడిపోయాడు.
బౌండరీ వద్ద ఓ క్యాచ్ పట్టుకుంటున్న సమయంలో షా ఎడమకాలి మడమకు గాయమైంది. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆస్ట్రేలియాతో ఆడిలైడ్లో జరగనున్న మొదటి టెస్టుకు పృధ్వీ షా ఆడడం లేదు. అతడికి విశ్రాంతి ఇస్తున్నట్టు బీసీసీఐ ధ్రువీకరించింది. గాయం తీవ్రతపై స్కానింగ్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఆస్ట్రేలియాలో ఇప్పటికే ముగిసిన 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది. ఓ మ్యాచ్ లో ఫలితం తేలలేదు. అచ్చం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను మరిపించేలా ఆడుతున్న పృథ్వీ షాను భారత జట్టు భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నారు.
JUST IN: Oh this doesn't look good. A nasty moment for India's rising star Prithvi Shaw at the SCG: https://t.co/k1aH1A6qeA #CAXIvIND pic.twitter.com/2eMaHhp8ab
— cricket.com.au (@cricketcomau) November 30, 2018