- Advertisement -
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారతజట్టు 80 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి టీ20లో నిరాశ పరిచిన రోహిత్ ఈ మ్యాచ్లో అర్ధశతకం చేశారు. 29 పరుగులకే 50 పరుగులు చేశాడు. మొత్తం స్కోరులో 4 సిక్సులు, మూడు ఫోర్లు ఉన్నాయి. 9 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోరు 77 పరుగులు చేసింది. అయితే ఆ వెంటనే రోహిత్ అవుట్ అయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగులతో ఆడుతోంది. క్రీజులో పంత్ 12 విజయ్ శంకర్ 1 ఉన్నారు.