ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లుంది ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్. మాంచెస్టర్లో జరిగి పోరులో పాక్పై భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాక్ టీమ్లై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదలా ఉంటె పాక్ నటి వీణామాలిక్, టెన్నీస్ స్టార్ సానియా మీర్జా మధ్య ట్విట్టర్లో ఓమో స్తరు చిన్న పాటి యుద్ధమే జరిగింది.శనివారం రాత్రి తన భర్త, పాకిస్థానీ ఆటగాడు షోయబ్ మాలిక్ తో సానియా ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కి వెళ్లిన ఒక వీడియో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత వైరల్ గా మారింది. తర్వాత రోజు భారత్ తో మ్యాచ్ ఉండగా షోయబ్, సానియా డిన్నర్ కి వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వీణామాలిక్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది. 9 నెలల తన కుమారుడిని సానియా హుక్కా సెంటర్కు తీసుకెళ్లడం ప్రమాదకరమని వీణా మాలిక్ ట్వీట్ చేసింది.
సానియా.. మీ అబ్బాయి గురించి నేనేంతో ఆందోళన చెందుతున్నా. మీరు అతణ్ని హుక్కా పీల్చే చోటుకు తీసుకెళ్లారు. ఇది బాబుకి ప్రమాదకరం కాదా..? నాకు తెలిసినంత వరకు పిల్లలకు, అథ్లెట్లకు జంక్ ఫుడ్ మంచిది కాదు. ఓ తల్లిగా, అథ్లెట్గా నీకు ఈ విషయం కచ్చితంగా తెలిసి ఉండాలి’’ అని వీణా మాలిక్ సానియాకు ట్వీట్ చేసింది.
మిగతా వాళ్ల కంటే నా కొడుకు పట్ల నేనేంతో శ్రద్ధ పెడతానని.. సానియా బదులిచ్చింది. షోయబ్ మాలిక్ జంక్ ఫుడ్ అలవాట్ల గురించి స్పందిస్తూ.. ‘‘నేను పాకిస్థాన్ క్రికెట్ జట్టు డైటీషియన్ను కాదు. పాక్ క్రికెటర్లు ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎప్పుడు నిద్ర లేస్తున్నారు, ఏం తింటున్నారో నేనేమీ వాళ్ల ప్రిన్సిపాల్నో లేదా టీచర్నో కాదు కదా. నువ్వు చూపిన అభిమానానికి ధన్యవాదాలు’’ అని సానియా బదులిచ్చింది.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ ను 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో భారత జట్టు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఓడిపోని తన రికార్డును పదిలంగా నిలుపుకొంది. భారత్ చేతిలో ఘోర పరాజయంతో పాకిస్థాన్ లో విమర్శల పెను దుమారం రేగుతోంది.