- Advertisement -
ప్రపంచకప్లో భాగంగా నిన్న మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్లో పాక్ ఘోరంగా ఓడిపోవడాన్ని పాక్ అభిమానులు జీర్నించుకోలేకపోతున్నారు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ అజేయ సెంచరీతో కదం తొక్కారు. పాక్ ఓటమిపై ఆ జట్టు మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ సర్పరాజ్ను ఏకిపారేస్తున్నారు.
ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకోలేని పాక్ అభిమానులు, సర్పరాజ్ ను ఏకేశారు. అతని ఆటతీరు పేలవమని ఎగతాళి చేశారు. “గుడ్ నైట్ బాయ్స్… అద్భుతమైన టీ కప్పుతో నన్ను నిద్ర లేపండి” అని ఒకరు చురకలు అంటించగా, అసలు సర్ఫరాజ్ బ్యాట్ ఎందుకు పట్టుకున్నాడని ఇంకొకరు ప్రశ్నించారు.