విశాఖ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా 502/7 డిక్లెర్ చేసింది. ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్నైట్ స్కోరు 202/0తో ఈరోజు తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియా.. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (215: 371 బంతుల్లో 23×4, 6×6), రోహిత్ శర్మ (176: 244 బంతుల్లో 23×4, 6×6) భారీ ఇన్నీంగ్స్ లు ఆడటంతో 500కి పైగా స్కోరు చేసింది.
రవీంద్ర జడేజా (30 నాటౌట్: 46 బంతుల్లో 1×6), అశ్విన్ 17 బంతులకు గాను 1 పరుగుతో అజేయంగా నిలిచారు.చతేశ్వర్ పుజారా (6), కెప్టెన్ విరాట్ కోహ్లి (20), అజింక్య రహానె (15) తేలిపోయినా.. ఒక ఎండ్లో ఓపికగా ఆడిన మయాంక్ అగర్వాల్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అయితే.. జట్టు స్కోరు 436 వద్ద మయాంక్ ఔటవగా.. హనుమ విహారి (10), సాహా (21) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. టీమిండియా 500 పరుగులు అందుకొనే వరకు వేట్ చేసిన కోహ్లీ 136వ ఓవర్లో భారత్ జట్టు 502/7కి చేరుకోగానే ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశాడు.