Thursday, April 25, 2024
- Advertisement -

మొదటి టెస్టులో పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా…

- Advertisement -

వైజాగ్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్ చేసింది. 500 పరుగుల పైచిలుకు స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్ లో సురక్షిత స్థితికి చేరింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (215), రోహిత్ శర్మ (176) పరుగుల వరద పారించడంతో రెండ్రోజుల్లోనే భారత్ భారీ స్కోరు సాధించింది. మయాంక్ డబుల్ సెంచరీ చేయడం రెండో రోజు ఆటలో హైలైట్.

మొదటి ఇన్నీంగ్స్ ని ప్రారంభించిన సఫారీలు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సఫారీలను భారత బౌలర్లు ఆదిలోనె పెద్ద షాక్ ఇచ్చారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా జట్టు 39/3 కి పరిమితం చేసింది. అశ్విన్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు. క్రీజ్ లో డీఎన్ ఎల్గర్ (27) తెంబా బవుమా (2) క్రీజులో ఉన్నారు. మాక్రమ్ 5, డిబ్రూన్ 4, పీడ్ 0 పెవిలియణ్ చేరారు.దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ 3 వికెట్లు తీయగా, ఫిలాండర్‌, డేన్‌ పైట్‌, ముతుసామి, ఎల్గర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

8 ఓవర్లు వేసిన అశ్విన్‌.. నాలుగు మెయిడెన్లు వేసి, తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి, 2 కీలక వికెట్లు పడగొట్టాడు.దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు వెనుకబడి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -