- Advertisement -
దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది టీమిండియా.మూడు టీ20ల ఈ సిరీస్లో ఈరోజు గెలవడం ద్వారా బోణి కొట్టాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా.. ఎక్కువ మంది యువ క్రికెటర్లకి మ్యాచ్లో అవకాశాలు కల్పించింది.