Friday, March 29, 2024
- Advertisement -

రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ….

- Advertisement -

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20ల్లో మరో రికార్డును బద్దలు కొట్టారు. దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి మొహాలి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ని గెలిచిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 72 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.

ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టాడు.2,434 పరుగులతో రోహిత్ ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా, నిన్నటి మ్యాచ్‌లో 72 పరుగులు చేసిన కోహ్లీ 2,441 పరుగులతో ఆ రికార్డును బద్దలుగొట్టి రోహిత్‌ను కిందికి నెట్టేశాడు. రోహిత్ 97 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా, కోహ్లీ 71 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఈ జాబితాలో కోహ్లీ, రోహిత్ తర్వాతి స్థానంలో మార్టిన్ గప్టిల్ (2,283), షోయబ్ మాలిక్ (2,263), బ్రెండన్ మెకల్లమ్ (2,140)లు టాప్-5లో కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -